Header Banner

ఏపీలో మహిళలకు శుభవార్త..! జూన్ నుంచే ఆ పథకం పునఃప్రారంభం!

  Sun May 25, 2025 08:26        Politics

ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిడ్డలను ప్రసవించే మహిళలు, శిశువుల రక్షణ కోసం గతంలో అమలు చేసిన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పునఃప్రారంభిస్తోంది. బాలింతలకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లను అందజేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో వచ్చే నెల నుంచి ఈ పథకం మొదలవుతుందని అధికారులు తాజాగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో ఏటా వేలాది కాన్పులు జరుగుతాయి. ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్లీ ఇవ్వడం వల్ల పుట్టిన పిల్లలకు మంచి జరుగుతుంది.

టీడీపీ ప్రభుత్వం 2016 జులైలో ఎన్టీఆర్ బేబీ కిట్ల పేరుతో ఈ పథకాన్ని మొదలుపెట్టింది. 2019లో వైఎస్ఆర్సీపీ సర్కారులు ఈ పథకం పేరును డాక్టర్ వైఎస్సార్ బేబీ కిట్లుగా మార్చింది. ఏడాది పాటు ఇచ్చి ఆ తర్వాత ఆపేసింది. దాదాపు నాలుగేళ్లుగా ఈ పథకం నిలిచిపోవడంతో లక్షల మంది మహిళలు లబ్ది పొందలేకపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్లీ మొదలుపెడుతున్నారు. దీనివల్ల నవజాత శిశు మరణాల రేటు తగ్గుతుంది. అంతేకాకుండా తల్లులు, వారి కుటుంబాలకు ఆర్ధికంగా కలిసొస్తుంది.

ఇక, రూ.1410 విలువ చేసే ఎన్టీఆర్ బేబీ కిట్‌లో 11 రకాల వస్తువులు ఉంటాయని అధికారులు తెలిపారు. చిన్నారికి దోమతెరతో కూడిన బెడ్, వాటర్‌ ప్రూఫ్‌ కాట్‌ షీట్, బేబీ డ్రస్, బేబీ సబ్బు, పౌడర్, న్యాప్‌కిన్, టవల్స్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బొమ్మ, తల్లి చేతులు శుభ్రం చేసుకోవడానికి లిక్విడ్."వీటి విలువ రూ.1410గా ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెప్పారు. ఈ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరుగుతాయని అధికారులు అన్నారు.

ఇక, ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం కోసం రూ.51.14 కోట్లు మంజూరు చేసినట్లు ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఎన్టీఆర్ బేబీ కిట్ ఒక్కోటి రూ.1,410 వరకు ఖర్చు అవుతుందని అందులో పేర్కొన్నారు. ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం పునరుద్ధరణ ద్వారా దాదాపు 4 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన తల్లులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో ఈ కిట్‌లను అందజేస్తారు. ఈ పథకం ముఖ్యోద్దేశం. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడటం, శిశు మరణాల రేటును తగ్గించడం. అంతేకాదు, ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలకు శిశు సంరక్షణ సామాగ్రిని ఉచితంగా అందించడం దీని ఉద్దేశం.

ఇది కూడా చదవండి: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


సినిమా పరిశ్రమలో అనవసర వివాదాలు సహించం.. పవన్‌ కల్యాణ్‌ డీప్‌గా హర్ట్‌ - ఏపీ మంత్రి హెచ్చరిక!


శ్రీవారి సేవల్లో భారీ మార్పులు! ఎన్నారైలకు ప్రత్యేక ప్రణాళికలు!


ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం భేటీ! పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై..


ఈ ఆధార్ 5 సంవత్సరాల తర్వాత పని చేయదు..! ఎందుకో తెలుసా?


దేశ రహస్యాలు పాక్‌కు! గుజరాత్‌లో ఆరోగ్య కార్యకర్త అరెస్ట్!


ఎల్‌ఐసీ సంచలనం! 24 గంటల్లో లక్షల పాలసీలు, గిన్నిస్ రికార్డు!


ఏపీలో కొత్తగా రెండు యూనివర్సిటీలు..! ఎక్కడెక్కడంటే ?


జర్మనీలో వైభవంగా టీడీపీ మహానాడు! పుల్వామా వీరులకు నివాళి, ప్రవాసులకు హామీ!


మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!


బిగ్ అలర్ట్.. యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APWomenWelfare #GoodNewsForWomen #APGovernmentScheme #WelfareScheme #WomenEmpowerment